రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్.. చేనేత కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వమని కేటీఆర్ ఉద్ఘాటించారు.సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Minister @KTRTRS participated in a #NationalHandloomDay event at Shilparamam in Hyderabad. Katherine Hadda, @USCGHyderabad, @jayesh_ranjan, Prl Secy, IT & Industries Dept and Shailaja Ramaiyer, Director, Handlooms & Textiles participated. pic.twitter.com/TN3COJwR7w
— Min IT, Telangana (@MinIT_Telangana) August 7, 2018