ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి!

     Written by : smtv Desk | Fri, Aug 24, 2018, 11:37 AM

 ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి!

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహ్‌తక్ ప్రాంతంలోని రానినల్లా లోయవద్ద వాహనం బోల్తా పడటంతో 11మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. మనాలి-లేహ్‌ జాతీయ రహదారి వైపు వెళ్తుండగా జరిగిన ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. కుల్లూ ఎస్పీ శాలినీ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘ఈ వాహనం మనాలీ నుంచి చంబా జిల్లాలోని పంగికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.ఓవర్ లోడ్,అతివేగం కారణం గా రానినల్లా ప్రాంతానికి చేరుకోగానే ఈ వాహనం అదుపుతప్పి అక్కడే ఉన్న లోయలో పడిపోయింది. దీనితో ఈ ఘటనలో 11మంది మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం తో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు అందించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఆ ప్రాంతాన్ని దట్టంగా పొగమంచు కప్పేసింది. ప్రమాదానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు అని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements