ఏషియన్ గేమ్స్ 2018లో భారత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం ఆరో రోజు ఆటలో భాగంగా భారత్ తన పతకాల వేటను కొనసాగిస్తోంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడి రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ ద్వయం విజయం సాధించి స్వర్ణాన్ని సాధించింది. తుది పోరులో బోపన్న జంట 2-0 తేడాతో బబ్లిక్- డెనిస్(కజికిస్తాన్)జోడిపై గెలిచి పసిడితో మెరిసింది. తొలి సెట్ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్తో పాటు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.