కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో దారుణం చోటు చేసుకుంది. పద్మ అనే బ్యూటిషియన్పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన దుండగులు కాళ్లు కట్టేసి చేతులు నరికారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొనఊపిరితో ఉన్న పద్మను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది కాలంగా భర్తకు దూరంగా ఉంటూ... బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. నూతన్కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె బాపుల పాడులో నివాసముంటోంది. ఆమెపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని ఇటు బంధువులు, అటు పోలీసులు అనుమానిస్తున్నారు.