ఆసియా గేమ్స్: సెమీస్‌కు చేరిన స్ప్రింటర్లు

     Written by : smtv Desk | Sat, Aug 25, 2018, 02:15 PM

ఆసియా గేమ్స్: సెమీస్‌కు చేరిన స్ప్రింటర్లు

ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల దిశగా సాగుతున్నారు. శనివారం జరిగిన ఫోటీల్లో భారత స్ప్రింటర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. ఆసియా చాంపియన్ మొహమ్మద్ అనాస్, అరోకియా రాజీవ్‌లు.. పురుషుల 400 మీటర్ల ఈవెంట్‌లో సెమీస్‌కు అర్హత సాధించారు.

ఈ ఇద్దరూ పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్‌లో దూసుకుపోతున్నారు. 400మీటర్ల ఈవెంట్‌లో మొహమ్మద్ అనాస్‌కు జాతీయ రికార్డు కూడా ఉంది. శనివారం జరిగిన హీట్స్‌లో అతను 45.36 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు. నాలుగవ హీట్స్‌లో మరో స్ప్రింటర్ రాజీవ్ 46.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.

ఇవాళ సాయంత్రం సెమీఫైనల్ రేస్ జరుగుతుంది. హైజంప్‌ లో చేతన్ బాలసుబ్రమణ్యన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2.15మీటర్ల ఎత్తును అతను క్లియర్ చేశాడు.





Untitled Document
Advertisements