వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం

     Written by : smtv Desk | Sat, Aug 25, 2018, 04:02 PM

వైసీపీ ఎమ్మెల్యే కోటి విరాళం

భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన కేరళవాసులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. వరదల దాటికి వందలాది మంది మృతి చెందగా.. అనేక మంది నిరాశ్రయులయ్యారు. కేరళీయుల బాధను అర్థం చేసుకున్న మనసున్న మనుషులు విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా , కేరళ వరద బాధితులని ఆదుకునేందుకు కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ముందుకొచ్చారు. తన సంస్థ తరఫున కోటి రూపాయల విరాళాన్ని కేరళ వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

డిమాండ్ డ్రఫ్ట్ రూపంలో నేరుగా కేరళ సీఎం ను కలిసి విరాళం అందజేయనున్నారు. అందుకోసం ఈ నెల 28 లేదా29న గౌతమ్ రెడ్డి కేరళ వెళ్తున్నారు. గౌతమ్ రెడ్డి ప్రస్తుతం ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.





Untitled Document
Advertisements