చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో ఇండియాలో మరో ఫోన్ని లాంఛ్ చేసింది. ఒప్పో ఏ5 నాచ్ డిస్ప్లేతో రావడం విశేషం. ఈ ఫోన్ని జూలైలోనే చైనాలో రిలీజ్ చేశారు. నెల రోజుల తర్వాత ఇండియాకు తీసుకొచ్చారు.ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ డివైస్ను తీసుకొచ్చింది. ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో తక్షణమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
ఒప్పో ఏ5 ఫీచర్స్
6.2 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో
720X1520 పిక్సెల్స్ రిసల్యూషన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ
256జీబీ దాకా విస్తరించుకునేఅవకాశం
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ పేసింగ్ కెమెరా
4230ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: 14,990 రూపాయలు