కేరళలో ఓనమ్ ఉత్సవాలు

     Written by : smtv Desk | Sat, Aug 25, 2018, 04:48 PM

కేరళలో ఓనమ్ ఉత్సవాలు

కేరళలో ఇవాళ ఓనమ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే వరద ప్రభావం నుంచి కోలుకుంటున్న రాష్ట్ర ప్రజలు.. అక్కడక్కడ ఓనమ్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని వేల సంఖ్యలో జనం విజిట్ చేస్తున్నారు.అన్నీ బాగుంటే ఈ రోజు ఓనమ్ పండుగను ఘనంగా చేసుకునే వారు. కొంత మంది ఈ పండుగకు దూరంగా ఉన్నా.. కొందరు మాత్రం చెంగనూరులోని రిలీఫ్ క్యాంపులోనే ఓనమ్ పండుగను జరుపుకుంటున్నారు.

ఓనమ్ సందర్భంగా కేరళలోని అనేక ఆలయాలను ముస్తాబు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్.. ఆ రాష్ట్ర ప్రజలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు వరద బాధిత కుటుంబాలకు.. భారతీయ వాయుదళం భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితులను ఆదుకోవడంలో ముందున్న భారత వాయుసేన .. ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు 20 కోట్ల చెక్కును అందజేసింది. ఎయిర్‌మార్షల్ సురేశ్ ఆ చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట జారీ చేశారు.





Untitled Document
Advertisements