ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ ఈ నెల 31 లేదా సెప్టెంబర్ ఒకటిన మానస సరోవర్ యాత్రకు వెళ్లనున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలోనే ఆయన మానససరోవర్ యాత్ర చేపట్టి శివుడిని దర్శించుకుంటానని చెప్పారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు శివుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు యాత్ర చేపట్టనున్నట్లు రాహుల్ తెలిపారు. నేపాల్ నుంచి కాకుండా చైనా మార్గం గుండా ఈ యాత్ర కోసం ప్రయాణిస్తారని తెలిసింది.
‘నేను హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం త్రుటిలో తప్పింది. దీన్నుంచి క్షేమంగా బయటపడతానని ఊహించలేదు. అప్పుడే అనుకున్నాను కైలాస్ వచ్చి శివుడిని దర్శించుకోవాలని. అందుకే కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నా. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత వెళ్లేందుకు ప్రణాళిక వేసుకుంటాను’ అని గతంలో రాహుల్ ఓ సభలో మాట్లాడుతూ చెప్పారు