టీమిండియాకు ఆదిలోనే షాక్

     Written by : smtv Desk | Sun, Sep 02, 2018, 05:42 PM

 టీమిండియాకు ఆదిలోనే షాక్

టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 271 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా 260/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇ‍న్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. మరో 11 పరుగులు మాత్రమే జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.

245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు





Untitled Document
Advertisements