భారత్‌కు భంగపాటు

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 11:42 AM

 భారత్‌కు భంగపాటు

ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌కు భంగపాటు ఎదురైంది. వరుసగా రెండు పరాజయాలతో విమర్శల జడివానలో చిక్కిన కోహ్లీ సేన మూడో టెస్టులో అద్భుత విజయంతో అంచనాలు పెంచింది. కానీ నాలుగో టెస్టులో సిరీ్‌సను సమం చేసే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకోవడంతో 60 పరుగుల తేడాతో ఓడింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లాండ్‌ కైవసం చేసుకుంది.

నాలుగో టెస్టులో 245 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 184 పరుగులకు ఆలౌటయ్యింది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 22 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఓపెనర్‌ కే ఎల్‌ రాహుల్‌ (0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే తొలి డౌన్‌లో వచ్చిన పుజారా (5) ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:273 ఆలౌట్‌
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 246 ఆలౌట్‌
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 271 ఆలౌట్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 184 ఆలౌట్‌





Untitled Document
Advertisements