కత్తి మహేశ్పై శనివారం క్రిమినల్ కేసు నమోదయ్యింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై, హైదరాబాద్లోని రహ్మత్ నగర్కు చెందిన గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది జూన్ 29 న ఓ టీవీ ఛానల్లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్ మాట్లాడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపిసి 295 (ఎ), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కాగా, ఈ వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్పై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనన కొద్ది రోజులుగా తన సొంత జిల్లా చిత్తూరులో ఉంటూ వచ్చారు. ఇటీవలే తన నివాసాన్ని విజయవాడకు మార్చుకున్నారు.