సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై క్రిమినల్‌ కేసు

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 01:40 PM

 సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ పై క్రిమినల్‌ కేసు

కత్తి మహేశ్‌పై శనివారం క్రిమినల్‌ కేసు నమోదయ్యింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ పై, హైదరాబాద్‌లోని రహ్మత్‌ నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది జూన్‌ 29 న ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్‌ మాట్లాడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపిసి 295 (ఎ), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కాగా, ఈ వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనన కొద్ది రోజులుగా తన సొంత జిల్లా చిత్తూరులో ఉంటూ వచ్చారు. ఇటీవలే తన నివాసాన్ని విజయవాడకు మార్చుకున్నారు.





Untitled Document
Advertisements