ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్ కు హ్యాకర్లు షాకిచ్చారు. కంపెనీ వెబ్ సైట్, మొబైల్ యాప్స్ పై దాడిచేసిన హ్యాకర్లు 3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను చోరీ చేశారు.ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంస్థ మొబైల్ యాప్ ద్వారా, ఎయిర్వేస్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్ ఎయిర్వేస్ సీఈవో అలెక్స్ క్రూజ్ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు.
ఈ ఘటనపై బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశామనీ, వారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని క్రూజ్ పేర్కొన్నారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకూ తమ వెబ్ సైట్, యాప్స్ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారు వెంటనే తమ కార్డులను బ్లాక్ చేయాలని సూచించారు.