మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్ఫోన్ ఎక్స్23ని తాజాగా విడుదల చేసింది. రూ.36,830 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 14వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
వివో ఎక్స్23 ప్రత్యేకతలు:
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
6.41" ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే (1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
స్నాప్డ్రాగన్ 670 చిప్ సెట్
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
వెనక భాగంలో రెండు 12/13 మెగాపిక్సల్ కెమెరాలు
12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
3400ఎంఏహెచ్ బ్యాటరీ