వ్యక్తిగత ఏజెండాతోనే టీఆర్ఎస్‌పై విమర్శలు

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 04:04 PM

 వ్యక్తిగత ఏజెండాతోనే టీఆర్ఎస్‌పై విమర్శలు

కొండా సురేఖపై టీఆర్ఎస్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓ వైపు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరోవైపు గుండు సుధారాణి ...కొండా సురేఖపై తీవ్ర విమర్శలు చేశారు.కొండా మురళీ, సురేఖ దంపతులకు సీఎం కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని టీఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు గుండు సుధారాణి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీపై కొండా దంపతులు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత కొండా దంపతులకు లేదన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేతలను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు. నియోజకవర్గ నాయకులను, ప్రజలను, పార్టీని కొండా దంపతులు అవమానించారు.బీసీ మహిళగా తనకు అన్యాయం జరిగిందని కొండా సురేఖ వ్యాఖ్యలు అవాస్తవం అని సుధారాణి అన్నారు. వ్యక్తిగత ఏజెండాతోనే టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. వెళ్లిపోవాలనుకుంటే కొండ దంపతులు పార్టీ నుంచి వెళ్లొచ్చని, అంతేకానీ తమకు అన్యాయం జరిగిందంటూ పార్టీ అభాండాలు వేయడం సరికాదన్నారు





Untitled Document
Advertisements