ఆదిలాబాద్: టీఆర్ఎస్లో అసంతృప్తి నాయకులు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పార్టీ వీడనున్నట్టు ప్రకటించిన కొండా సురేఖతో సహా టికెట్ రాని నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖనాయక్ను ప్రకటించడంపై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అనుచరుల అభీష్టం మేరకు ఖానాపూర్ నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ‘‘టీఆర్ఎస్కు నా బలం ఏంటో చూపిస్తా. టికెట్ హామీతోనే టీఆర్ఎస్లో చేరాను. అన్యాయం చేశారు. ఖానాపూర్ రేఖానాయక్ జాగీరు కాదు. కమీషన్ల కోసం ప్రజాప్రయోజనాలను రేఖానాయక్ తాకట్టు పెట్టారు’’ అని రాథోడ్ ఆరోపించారు.
ఖానపూర్ లో బలమైన ప్రత్యర్థిగా రమేష్ రాథోడ్ ని దింపే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో రాథోడ్ చే ప్రకటన చేయించే అవకాశం ఉంది.