‘దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ పెద్ద బఫూన్’ అని సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా తీవ్రంగా స్పందించారు. టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ, “సచివాలయంలో అడుగుపెడితే అధికారం కోల్పోతావని ఎవరో జ్యోతిష్యుడు చెపితే ఆ మాటనమ్మి సచివాలయానికి రాకుండానే నాలుగేళ్ళు పాలించిన సిఎం కెసిఆర్ నిజమైన బఫూన్. ఇటువంటి జాతకాల పిచ్చి ఉన్న ఏకైక సిఎం దేశంలో కెసిఆర్ ఒక్కరే. ఆయన రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నందునే హడావుడిగా శాసనసభను రద్దు చేసి, పార్టీ అభ్యర్ధులను ప్రకటించేసి అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. లేకుంటే తొమ్మిది నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు.