పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 10న నిర్వహించే అఖిల భారత బంద్కు అన్ని పక్షాలు కలిసి రావాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు, వాణిజ్యసంస్థలు అందరు బంద్కు సహకరించాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ధరలు విపరీతంగా పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు అంతకు అంత పెంచారని విమర్శించారు. ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేసారు.