మోడీ పై మండిపడ్డ నాయుడు

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 12:49 PM

మోడీ పై మండిపడ్డ నాయుడు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు ఏమిచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తనకు, కేసీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించేందుకు మోడీ ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందన్నారు. కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని ఎన్డీఏను హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను త్వరలోనే వంద రూపాయలు చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. స్విస్‌ బ్యాంకుల్లోని డబ్బు తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామన్నారు.. ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.





Untitled Document
Advertisements