కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ట్విటర్ వార్ జోరందుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీనేత దిగ్విజయ్ సింగ్ ఖండిస్తూ.. ‘కేసీఆర్ కృతజ్ఞత లేని వ్యక్తి’ అని మండిపడ్డారు. ఎన్నో అవరోధాల మధ్య కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, అలాంటి పార్టీ అధ్యక్షుడిపై కేసీఆర్ అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారని, ఇందుకు కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కృతజ్ఞత లేని కేసీఆర్ను తెలంగాణ ప్రజలు శిక్షిస్తారని హెచ్చరించారు.ట్వీట్పై టీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ ఖండించడం కన్నా ముందు తెలంగాణకు స్పెల్లింగ్ తెలుసుకోవాలని చురకలంటించారు. ఈమేరకు కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్లో తెలంగాణను ఆంగ్లంలో 'telengana' అని రాయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.
అంతకు ముందు కేటీఆర్ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.‘‘రాజకీయాల్లో ఏం చేయాలో అంట్లు కడిగిన కేటీఆర్ మాకు చెప్పనవసరం లేదు’’ అన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ..‘‘అమెరికాలో నివసించే ప్రతి భారతీయుడు తాము భోజనం చేసిన పళ్లెంను స్వయంగా శుభ్రం చేసుకుంటాడు. అలాగే నేనూ చేశాను. మీ పప్పు(రాహుల్)లా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.