సందర్భం వచ్చినప్పుడుల్లా యాగాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నట్లు అఖిల భారతీయ హిందూమహాసభ తెలిపింది. ఆయన పలు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, హిందూ పండగలను రాష్ర్ట పండగలుగా ప్రకటించారని కొనియాడింది. సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు గాను తాము ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతిస్తున్నట్లు సభ జాతీయ అధ్యక్షులు శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి తెలిపారు.