ఒంటరిగానే పోటీ

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 01:07 PM

ఒంటరిగానే పోటీ

తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్యాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్నికల హవిడిలో నిమగ్నమయ్యాయి. కొన్ని పార్టీలు పొత్తులపై సై అంటుంటే కొన్ని పార్టీలు ఒంటరిగా పోటీకి రెడీ అయ్యాయి.

అయితే తెరాస ఒంటరిగానే పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.. ఇక టికాంగ్రెస్ పార్టీ టీడీపీ తో కలిసి పోటీ చేస్తున్నారు కొన్ని వార్తలు వస్తున్నా సంగతీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో బీజేపీ మాత్రం 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని ఈ రోజు విలేకర్ల సమావేశములో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు.ముందుగా 50 నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 15న జరగబోయే పాలమూరులో బహిరంగ సభలో అమిత్ షా హాజరవుతారని, అనంతరం తమ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులు జరుగుతాయని చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.





Untitled Document
Advertisements