సైబర్ క్రైం కేసులో సాక్ష్యం చెప్పేందుకు కూకట్పల్లి కోర్టుకు ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. హైదరాబాద్, సనత్ నగర్ లోని డీసీబీ బ్యాంకులో లక్ష్మణ్కు అకౌంట్ ఉంది. 2014లో ఓ హ్యాకర్ ఈ అకౌంట్ నుంచి రూ.10 లక్షలు తస్కరించాడు. దీంతో బ్యాంక్ మేనేజర్ సూచనతో లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించాడు.పోలీసులు 2015లో నిందితుడిని పట్టుకొని నగదు రికవరీ చేశారు. కేసు విషయంలో సాక్ష్యం చెప్పేందుకు లక్ష్మణ్ కోర్టుకు హాజరయ్యారని న్యాయవాది హర్షవర్ధన్ తెలిపారు.