ముందస్తు ఎన్నికలకు వెళ్ళం : నారా లోకేష్

     Written by : smtv Desk | Thu, Sep 13, 2018, 12:32 PM

ముందస్తు ఎన్నికలకు వెళ్ళం : నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇతరుల జోలికి వెళ్లే తీరిక తమకు లేదనీ, ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసుకునే పనిలో తాము నిమగ్నం అయ్యామని వ్యాఖ్యానించారు

నాడు తెలంగాణ ప్రయోజనాల కోసమే 2010లో చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు. ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువను ప్రజలు చూశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు పంపిస్తే న్యాయస్థానంలో హాజరవుతామని తెలిపారు చంద్రబాబు సహా టీడీపీ నేతలందరినీ నాడు అరెస్ట్ చేసినా తాము వెనక్కు తగ్గలేదని ఈ సందర్బంగా తెలిపారు.





Untitled Document
Advertisements