కోర్టుకెక్కిన అరవింద స్వామి

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 03:02 PM

కోర్టుకెక్కిన అరవింద స్వామి

ఒక సినిమాకి సంభందించి ప్రముఖ నిర్మాత తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని ఇటీవల మద్రాసు కోర్టు ని ఆశ్రయించారు అరవింద స్వామి , నిజానిజాలు పరిశీలించిన హై కోర్టు ఈ విషయమై సెప్టెంబర్ 20 లోగ వివరణ ఇవ్వవలసినదిగా నిర్మాత మనోబాల కు నోటీసులు జారి చేసింది .

అరవిందస్వామి తరపు న్యాయవాది మాట్లాడుతూ "నా క్లయింటు చధురంగవెట్టి-2 అనే సినిమాలో నటించారు ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా మనోబాల వ్యవహరించారు, సినిమాకి కుదుర్చుకున్న పారితోషకం లో ఇంకా తన క్లయింటు కి 1.79 కోట్లు నిర్మాత బాకి ఉన్నారు" అని పేర్కొన్నారు ఈ విషయమై ఎన్ని సార్లు సంప్రదించినా స్పందించకపోవడం తో కోర్టును ఆశ్రయించినట్టుగా తెలిపారు.





Untitled Document
Advertisements