చంద్రబాబు 22 వాయిదాలకు వెళ్ళలేదు : మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 03:32 PM

చంద్రబాబు 22 వాయిదాలకు వెళ్ళలేదు : మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

విజయవాడ : చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసుల వెనుక మోదీ ఉన్నారని టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కోర్టు కేసుల నుండి ఎవ్వరు తప్పించుకోలేరని అన్నారు. 2013 నుంచి కేసు నడుస్తోందని, అప్పటి నుంచీ వారికి నోటీసులు వస్తున్నాయని, 2016 వరకు తెదేపా నాయకులు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారని కన్నా తెలిపారు. కానీ చంద్రబాబు 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్లే వారెంట్‌ వచ్చిందని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements