ఢిల్లీ : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ గెలవాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు.
గ్రూపులకు అతీతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. యువతను ప్రోత్సహించాలని రాహుల్ గాంధీకి సూచించామన్నారు. కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తామని తప్పకుండ తెలంగాణాలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.