అమరావతి : బాబ్లీ ప్రాజెక్ట్ వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు నాన్బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీచేయడాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తప్పుపట్టారు. ప్రజా పోరాటాలు చేస్తే కేసులు పెట్టడమేంటని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రావని తేల్చి చెప్పిన ఆయన, ఏపీలో ఉద్యమాల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.