ఇండియా: రూపాయి విలువ రోజురోజుకీ పతనమవుతున్నకారణంగా తగిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుంది, అందులో భాగంగా దేశం లో దిగుమతిని అవసరానికి తగినట్టుగా ఉపయోగించుకోవలసినదిగా, అనవసరపు వస్తు దిగుమతిని కట్టడి చేయవలసిందిగా కేంద్రం తలుస్తుంది, అదేవిధంగా మన దేశం లోని వస్తువులకు ఎగుమతి పెంచాలని అనుకుంటుంది
ఈ నేపధ్యం లో ప్రపంచ వాణిజ్య సంస్థ నిభందనలకు అనుగుణంగానే చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాక్యానించారు, సంభందిత మత్రిత్వ శాఖ తో సంప్రదించి ఏ వస్తువుల దిగుమతిని ఆపివేయాలన్నది నిర్ణయం తీసుకుంటామన్నారు