అందరూ 'మా' వారే - తమ్మారెడ్డి

     Written by : smtv Desk | Sat, Sep 15, 2018, 04:36 PM

అందరూ 'మా' వారే - తమ్మారెడ్డి


హైదరాబాద్: సినిమా వాళ్ళంతా కలిసి నిర్మించుకున్న 'మా' అసోసియేషన్ ఈ మధ్య తరచూ వివాదాల్లో నిలుస్తుంది, మొన్నటి దాక శ్రీ రెడ్డి వివాదం లో తలమునకలైన 'మా' సంఘంలో ఇప్పుడు అద్యక్షుడు శివాజీ రాజ కి నరేష్ కి మద్యన అభిప్రాయ బేధాలు ఏర్పడి రెండు గ్రూపులుగా విడిపోయారు.

ఇంక లాభం లేదనుకుని, సినీ పెద్దలు కలుగ జేసుకుని వివాదం సద్దుమనిగేలా చేసారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ " విభేదాలు తలెత్తిన మాట నిజమే కానీ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది, మా సంఘం లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, కలెక్టివ్ కమిటీ ముందు అన్నీ వివరాలు ఉంచాము ఇక నుండి శివాజీ రాజ, నరేష్ లు కలిసి పని చేస్తారు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు అందరం కలిసి పని చేసి వేడుకలను విజయవంతం చేస్తాం, ఇక నుంచి అన్ని వ్యవహారాలు ఫిలిం ఇండస్ట్రినే చూసుకుంటుంది." అని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements