విజయ్ అభిమానులపై లాఠీ ఛార్జి...

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 10:49 AM

విజయ్ అభిమానులపై లాఠీ ఛార్జి...

పాండిచ్చేరి: తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు హద్దులు ధాటి అభిమానం చూపించారు, శుక్రవారం జరిగిన ఓ వేడుకకు సతీ సమేతంగా హజరయ్యారు విజయ్, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో తమ అభిమాన హీరో ని చూడటానికి పోటీ పడ్డారు ఇంతలో పరిస్తితులు చేయి దాటాయి, ఒక్కసారిగా విజయ్ ని చుట్టునుట్టిన అభిమానులు ఆయనను గాయపడేలా చేశారు.

అభిమానులను ఆపడం అక్కడ ఉన్న బౌన్సర్ లకు కూడా సాధ్యం అవ్వకపోవడం తో పోలీసులు అభిమానులపై లాఠీ ఛార్జి చేసి పరిస్తితులను అదుపులోకి తెచ్చారు. అయితే విజయ్‌ అఖిలభారత అభిమాన సంఘం అధ్యక్షుడు, పాండిచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఆనంద్‌ కూతురు వివాహా వేడుకకు విజయ్ హజరయ్యారు, వధూవరులను ఆశిర్వదించడానికి స్టేజి పైకి వెల్లబోతున్న సమయం లో తీవ్ర తోపులాట జరిగి విజయ్ కాలికి గాయం జరిగింది , విజయ్ అథిదిగా వస్తారని ముందుగానే పోస్టర్లు వేసి ప్రచారం చేయడం తో అభిమానుల తాకిడి పెరిగింది.





Untitled Document
Advertisements