హైదరాబాద్: ఈ మద్యనే అక్కినేని వారింటి కోడలు గా అడుగు పెట్టిన సమంత 'యూ టర్న్' సినిమా విజయం తో సంబరపడుతోంది, కుటుంబం గురించి చెప్తూ... తన అత్తింటి వారు తనకి అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటారని, మునుపటికన్నా తాను పెళ్ళయ్యాక చాలా దృడంగా మారానని తెలిపింది, తన కుటుంబం తనకి ఎల్లవేళలా అండగా ఉంటారని అక్కినేని కుటుంబాన్ని పొగడ్తలతో ముంచేసింది, ఇక పిల్లల విషయం అడిగినపుడు 'ఆ భగవంతుడు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే' అని చిరునవ్వులు చిందించింది.
రెండు రోజుల క్రితం పవన్ కుమార్ దర్శకత్వం లో వచ్చిన' యూ టర్న్' చిత్రం విజయం దిశగా దూసుకుపోతుంది, తమిళం లో కూడా సమంత నటించిన 'సీమ రాజ' మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, కాగా తన తదుపరి సినిమాలని తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం లో ఉంది సమంత.