మరోసారి నాని తో సై అంటున్న మలయాళీ భామ

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 04:21 PM

మరోసారి నాని తో సై అంటున్న మలయాళీ భామ

హైదరాబాద్: నాగార్జునతో 'దేవదాస్' చిత్రం పూర్తీ చేసిన నాని తన తరువాతి చిత్రం 'జెర్సీ'ని ప్రారంభించే పనుల్లో ఉన్నాడు, ఈ సినిమాలో నాని వృద్దుడు గా, యుక్త వయస్కుడిగా కూడా నటించాల్సిన అవసరం ఉందట, ఇప్పటికే ఒక కథానాయికగా కశ్మీర పరదేశిని ఎంపిక చేశారు ఇంకో పాత్రకు నిత్యా మీనన్ అయితే బావుంటుందని యూనిట్ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఈ విషయమై నిత్య మీనన్ ని సంప్రదించడం కూడా జరిగిందట ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గతం లో నాని, నిత్యా మీనన్ జంటగా వచ్చిన 'అలా మొదలైంది' చిత్రం మంచి విజయాన్ని సాదించింది.





Untitled Document
Advertisements