హైదరాబాద్: మిర్యాలగూడ ఘటన లో హత్యకు గురైన ప్రణయ్ కు ప్రముఖ సినీ తారలు సంతాపం తెలుపుతున్న సమయం లో 'వీరభోగ వసంత రాయులు' నటులు నారా రోహిత్, సుధీర్ బాబు తమ సినిమా లో ని మొదటి పాటని ప్రణయ్ కి, ప్రణయ్ లాంటి బాధితులకి అంకితమిస్తున్నామని తెలిపారు. ఈ నెల 21 న చిత్ర యూనిట్ ఈ పాటను విడుదల చేయనున్నట్టుగా తెలిపారు, గాయని చిన్మయి కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసారు, ఈ కుల జాడ్యాన్ని తరిమికొట్టాలంటే ముందు తమ పేర్లకు తగిలించుకున్న తోకలని కత్తిరించాలని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసారు .