హైదరాబాద్: తెలుగులో వరుస విజయాలతో 'విజయ' బావుటా ఎగురవేస్తున్న దేవరకొండ బాలీవుడ్ లోను తన సత్తా చాటనున్నాడు, అశ్వనీదత్ నిర్మాతగా, రాజ్-డీకే దర్శకత్వం లో
ఓ సినిమా కి శ్రీకారం చుట్టనున్నారు ,ఈ సినిమాలో విజయ్ ని కథానాయకుడిగా నిర్ణయించారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే తన డిఫరెంట్ ఆటిట్యూడ్ తో యువతను అమితంగా ఆకట్టుకున్న విజయ్ ఉత్తర భారతీయులను కూడా బుట్టలో వేసుకోవడం ఖాయం అనే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు విజయ్, 'గీత గోవిందం' లాంటి పెద్ద హిట్ తరువాత 'డియర్ కామ్రేడ్', 'నోటా' సినిమాలలో విజయ్ నటిస్తున్నాడు అందులో భాగంగా... ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం ఇచ్చింది ఈ కథాంశం ఆధారంగా చేసుకుని ఆనంద్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం నోటా, దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసే పనిలో ఉన్నాడు విజయ్.