సొంతంగా వాహనం నడుపుకొనే యజమానికి వర్తించే తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ మొత్తాన్ని రూ.15లక్షలకు పెంచుతూ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్డీఏఐ) ఉత్తర్వులు జారీ చేసింది.ఏడాదికి రూ.750 చెల్లించి రూ.15 లక్షల వరకు యజమాని-డ్రైవర్లకు కనీస బీమా కవరేజ్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం క్యాపిటల్ సమ్ ఇన్సూర్డ్(సీఎస్ఐ) సెక్షన్ కింద ద్విచక్ర, ప్రైవేట్ కారు/కమర్షియల్ వాహనాలపై లక్ష, రెండు లక్షల రూపాయల వరకు మాత్రమే బీమా కవరేజ్ లభిస్తున్నది. ప్రస్తుతం పలు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్యాకేజి కింద అధిక సీఎస్ఐని ఆఫర్ చేస్తున్నాయి.
ఇందుకోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాలసీదారుడిపై పడుతున్న భారాన్ని దృష్టిలో పెట్టుకొని నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో ఉన్న అన్ని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు నిర్బంధ వ్యక్తిగత ప్రమాదం(సీపీఏ) కింద యజమాని-డ్రైవర్కు కనీసంగా రూ.15 లక్షల బీమా కవరేజ్ కల్పించాలని సూచించింది. ఇందుకుగాను ప్రతియేటా రూ.750 చొప్పున ప్రీమియం తీసుకోవాలని పేర్కొంది.
ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడడం, మరణించడం సంభవించినప్పుడు పాలసీదారు నామినీలకు ఈ పరిహారం అందనుంది