‘బీసీ గర్జన’ : కళా వెంకట్రావు

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 05:59 PM

‘బీసీ గర్జన’ : కళా వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీను ప్రజలు ఎలా నమ్మాలని ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆ పార్టీకి కేంద్రంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఉనికి లేదన్నారు. బీజేపీకు ఓట్లేస్తే వృథా ప్రయాసేనని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ.. అక్టోబరు నెలాఖరున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.





Untitled Document
Advertisements