చైతన్య ఆశలన్నీ సవ్యసాచి పైన

     Written by : smtv Desk | Sat, Sep 22, 2018, 06:31 PM

చైతన్య ఆశలన్నీ సవ్యసాచి పైన

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. పాతిక కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా వారంలో 16 కోట్ల పైన కలక్షన్స్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా 9 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. అయితే వారానికి రెండు మూడు కొత్త సినిమాలు వస్తున్న ఈ తరుణంలో శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర తన పరుగు ఆపేశాడని తెలుస్తుంది.

వీక్ డేస్ కలక్షన్స్ ఓకే అనేలా ఉన్నా ఆ తర్వాత అంతగా కలక్షన్స్ రాబట్టడం లేదట. మారుతి మార్క్ వల్ల మొదటి రోజు హుశారైన కలక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే కలక్షన్స్ జోరు కొనసాగితే ఈపాటికి 30 కోట్ల దాకా వచ్చేయాల్సింది. ఫైనల్ గా అల్లుడు కూడా నాగ చైతన్యని నిరాశ పరచింది. ఇక రానున్న సవ్యసాచి సినిమా మీద అతను దృష్టి పెట్టాల్సి ఉంది.





Untitled Document
Advertisements