పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 11:40 AM

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత  ప్రియం

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి.రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌పై లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌పై 18 పైసలు పెరిగింది. దీనిప్రకారం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.83.22, డీజిల్‌ రూ. 74,42గా ఉంది.

అలాగే ముంబైలో పెట్రోల్‌పై లీటర్‌కు 22 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.88.23, డీజిల్‌ రూ.80.95గా ఉంది.





Untitled Document
Advertisements