బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత

     Written by : smtv Desk | Mon, Nov 05, 2018, 02:13 PM

బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత

గోవా, నవంబర్ 5: గోవా కాంగ్రెస్ మహిళా నేత దియా షెట్కార్ సుభాష్ శిరోద్కర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ శిరోద్కర్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శిరోద్కర్, ఆపై బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

మీడియాతో దియా మాట్లాడుతూ… ‘సుభాష్‌కు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తున్నానని, వెంటనే నేను ఆగిపోకుంటే రేప్ చేస్తామని ఆయన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. ఫోన్ చేసిన సమయంలో బూతులను వాళ్లు వాడుతున్నారు’ అని తెలిపారు దియా. ఓ మహిళను ఎదుర్కోలేక, వారు అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. శిరోద్కర్ నియోజకవర్గంలో తాను ప్రవేశించరాదని వారు ఆదేశిస్తున్నారని తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా దియా ఆరోపణలపై శిరోద్కర్ ఎలా స్పందిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements