మధ్యంప్రియులకు షాక్

     Written by : smtv Desk | Sat, Nov 10, 2018, 06:02 PM

మధ్యంప్రియులకు షాక్

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7న పోలింగ్ జరగనుండగా 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements