తెరాస అభ్యర్దుల జాబితా విడుదల

     Written by : smtv Desk | Thu, Nov 15, 2018, 11:32 AM

తెరాస అభ్యర్దుల జాబితా విడుదల

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్భంగా తెరాస 107 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించినప్పటికీ మిగిలిన 12 స్థానాలకు నిన్నటివరకు పేర్లు ప్రకటించలేదు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తే దానిని బట్టి మిగిలిన స్థానాలకు అభ్యర్ధులను ప్రకటిద్దామని సిఎం కేసీఆర్‌ ఇంతకాలం ఎదురుచూశారు. అయితే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో కేవలం 65 మంది పేర్లనే ప్రకటించగా, తెలంగాణ జనసమితి నేడు 6 స్థానాలకు, సిపిఐ3 స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ మొత్తం 75 మంది అభ్యర్ధులను ప్రకటించడంతో తెరాస కూడా బుదవారం రాత్రి మరో 10 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. దీంతో తెరాస మొత్తం 117 మంది అభ్యర్ధులను ప్రకటించినట్లయింది. ఇంకా కోదాడ, ముషీరాబాద్ స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించవలసి ఉంది.

తెరాస 10 మంది అభ్యర్ధుల వివరాలు:

1. ఖైరతాబాద్: దానం నాగేందర్
2. వరంగల్ ఈస్ట్: నన్నపూనేని నరేందర్
3. ఛార్మినార్: మహమ్మద్ సల్లావుద్దీన్ లోడీ
4. మేడ్చల్: చామకూర మల్లారెడ్డి
5. గోషామహల్: ప్రేమ్ సింగ్ రాధోడ్
6. మల్కాజ్ గిరీ: మైనంపల్లి హనుమంత రావు
7. అంబర్ పేట: కాలేరు వెంకటేష్
8. చొప్పదండి: ఎస్.రవిశంకర్
9. హుజూర్ నగర్: శానంపూడి సైది రెడ్డి
10. వికారాబాద్: డాక్టర్ మెతుకు ఆనంద్





Untitled Document
Advertisements