మాజీ ముఖ్యమంత్రి తనయుడుకి నిరాశ మిగిల్చిన కాంగ్రెస్

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 01:24 PM

మాజీ ముఖ్యమంత్రి తనయుడుకి నిరాశ మిగిల్చిన కాంగ్రెస్

హైదరాబాద్, నవంబర్ 17: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి ఆ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనికి కాంగ్రెస్ విడుదల చేసిన మూడు జాబితాల్లో తన పేరు లేకపోవడం అతని నిరాశకు గురి చేసింది.

మహాకూటమి పొత్తులో భాగంగా సనత్‌నగర్ సీటు టీడీపీకి కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో సనత్‌నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్‌‌గౌడ్ పేరును టీడీపీ ఖారారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడైన మర్రికి తొలి జాబితా, రెండో జాబితాలో చోటు దక్కకపోయినా మూడో జాబితాలో అయినా చోటు దక్కుతుందని ఆశించారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మర్రి అన్నారు. తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి, త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు





Untitled Document
Advertisements