చెన్నై, నవంబర్ 17: చెన్నైలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. రాజస్తాన్లోని జోధ్పూర్ నుంచి శనివారం ఉయం వచ్చిన రైలు కంటైనర్లలో 1,100 కేజీల కుక్క మాంసాన్ని చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదో ప్లాట్ ఫారంపైకి వచ్చిన రైల్లో ఈ మాంసం దిగుమతి అయిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టామని తెలిపారు. మాంసం బాగా కుళ్లిన వాసన రావడంతో గుట్టురట్టయింది. దీన్ని తక్కువ ధరకు హోటళ్లకు అమ్ముతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కోల్కతాలో భారీస్థాయిలో కుక్క మాంసం దొరికిన సంగతి విదితమే. చెన్నై, హైదారాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో శునకాలను వధించి, మేక మాంసంలో గ్రామ సింహాల మాంసాన్ని కలిపేస్తున్నారు.