ఆయుత చండీయాగం ప్రారంభం

     Written by : smtv Desk | Sun, Nov 18, 2018, 01:44 PM

ఆయుత చండీయాగం ప్రారంభం

ఎర్రవెల్లి, నవంబర్ 18: గత ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆయుత చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలను నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ హోమాలు ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. రాజశ్యామల చండీ యాగంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. ఇక.. చండీ సహిత రుద్ర హోయంలో కొంతమంది నేతలు పాల్గొన్నట్టు సమాచారం. ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న ఈ యాగాల్లో దాదాపు 120 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. రేపటి వరకు ఈ యాగాలు జరగనున్నాయి.





Untitled Document
Advertisements