ముషీరాబాద్ టికెట్ గోపాల్ కు కైవసం

     Written by : smtv Desk | Sun, Nov 18, 2018, 06:48 PM

ముషీరాబాద్ టికెట్ గోపాల్ కు కైవసం

హైదరాబాద్, నవంబర్ 18: ముందస్తు ఎన్నికల సందర్భంగా నామినేషన్ గడువు రేపటితో ముగిసిపోతుంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెరాస పార్టీ నుండి కోదాడ, ముషీరాబాద్ టికెట్లు ఎవరికిస్తారన్నదాని పై ఇవ్వాళా కొలిక్కి వచ్చింది. కోదాడ నుంచి ఇటీవల పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు టికెట్ లభించగా, ముషీరాబాద్ టికెట్ ముఠా గోపాల్ కైవసం చేసుకున్నారు.

రేపు బర్కత్‌పురాలో జరుగనున్న కార్యక్రమంలో హోమ్ మంత్రి నాయిని నరసింహరెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టీఆర్ఎస్ బి-ఫామ్‌ను ముఠా గోపాల్ తీసుకుంటారు. నాయిని నర్సింహరెడ్డి ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆధ్వర్యంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారు. వీరిద్దరి ఎంపికతో తెరాస పార్టీ 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం పూర్తయింది.





Untitled Document
Advertisements