నేటితో నామినేషన్లు నమోదు గడువు పూర్తి

     Written by : smtv Desk | Mon, Nov 19, 2018, 05:15 PM

నేటితో నామినేషన్లు నమోదు గడువు పూర్తి

హైదరాబాద్, నవంబర్ 19: నేటితో నామినేషన్లు వేయడానికి గడువు పూర్తవుతుంది. తెరాస మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. బిజెపి 117, కాంగ్రెస్‌ 94, టిడిపి-13, టిజేఎస్-14, సిపిఐ-3,మజ్లీస్-7 స్థానాలలో తమ అభ్యర్ధులను ప్రకటించాయి. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా నిన్నటివరకు మొత్తం 1497 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు.

చివరి రోజైన ఈరోజు అన్ని పార్టీలలో మిగిలిన స్థానాలకు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అలాగే స్వతంత్ర, రెబెల్ అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేయనున్నారు. రేపు ఎన్నికల సంఘం నామినేషన్ పత్రాల పరిశీలిస్తుంది. నవంబరు 21 నుంచి 22 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంటుంది.





Untitled Document
Advertisements