టాస్ గెలిచి ఫీల్డింగ్ బరిలో భారత్

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 01:33 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ బరిలో భారత్

బ్రిస్బేన్, నవంబర్ 21: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

మూడు టీ20ల సిరిస్‌తో ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు టీమిండియా శ్రీకారం చుట్టబోతోంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆసీస్ సొంతగడ్డపై భారత్‌కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.





Untitled Document
Advertisements