నిత్యానంద స్వామి కోసం పోలిసుల గాలింపులు

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 04:32 PM

నిత్యానంద స్వామి కోసం పోలిసుల గాలింపులు

కర్ణాటక, నవంబర్ 21: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి 'గంజాయి తీసుకుంటే తప్పేం లేదు' అని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసి జనాలకు ఏం సందేశం ఇస్తున్నారనే కోణంలో ఆయన కోసం కర్ణాటక పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిత్యానంద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయి, తెగ దూమారం రేపాయి. దీంతో సీసీబీ పోలీసులు నిత్యానందకు ఇటీవల నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులపై ఆయన స్పందించపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చెయ్యటానికి రంగంలోకి దిగారు. పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే నిత్యానంద బిడిది వీడి తమిళనాడులో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. వొక ప్రత్యేక బృందం నిత్యానంద కోసం అక్కడికి వెళ్ళారు





Untitled Document
Advertisements