ఢిల్లీ సీయెం పై దాడి

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 06:20 PM

ఢిల్లీ సీయెం పై దాడి

న్యూ ఢిల్లీ, నవంబర్ 21: నగర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై అనీల్ కుమార్ అనే వ్యక్తి దాడి చేసాడు. మంగళవారం దిల్లీ సెక్రటేరియట్‌లోని ఆయన ఛాంబర్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో నరియానా ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ముఖంపై కారం చల్లి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. విజిటర్స్‌ ఏరియాలో ఉండి కేజ్రీవాల్‌ బయటకు రాగానే ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కేజ్రీవాల్‌ కళ్లజోడు కిందపడిపోయి పగిలిపోయింది.

అయితే అసలు ఎందుకు దాడి చేసాడు అనేది మాత్రం తెలియలేదు. ఇటీవల ఆప్‌ కౌన్సిలర్‌ ఇంటిపై దాదాపు 25 మంది తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన సంఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements